'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో అదిరిపోయే హిట్ అందుకొన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కెరియర్ పరంగా అంతా అయిపోయింది అనుకున్న టైమ్ లో హీరో రామ్ తో పూరి జగన్నాథ్ తీసిన ఈ సినిమా పూరి కెరీర్ తో పాటు రామ్ కెరీర్ ని కూడా మార్చేసింది. గత ఏడాది జూలై 18 వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమాకి కళ్ళు చెదిరిపోయే కలెక్షన్లతో పాటు లాభాలు కూడా ఆ స్థాయిలోనే వచ్చాయి. దీంతో సినిమా కోసం ఇల్లు బంగ్లా అమ్ముకున్న పూరి జగన్నాథ్ ఈ సినిమా లాభాలతో అదే స్థాయిలో మళ్లీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఏకంగా ముంబాయిలో ఓ భవనం కూడా కొనుక్కోవడం జరిగింది. కాగా నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.

 

ఈ సినిమాకి టైటిల్ ఫైటర్. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయిలాండ్ వెళ్లి మరీ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైయిన్ అయి వచ్చాడు. తనలో చాలా మార్పులు వస్తాయని, ఇక నుంచి రాబోయే చిత్రాలన్నీ కొత్తగానే ఉంటాయని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టే విజయ్ బాడీలోనూ మార్పులు వచ్చేశాయి. విజయ్ సరసన బాలీవుడ్ హాట్ భామ అనన్య పాండేను తీసుకున్నారు. మొదటగా ఈ పాత్రకు జాన్వీ కపూర్‌ను తీసుకుందామని అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు కానీ అటు వైపు నుంచి స్పందన రాకపోయే సరికి అనన్య పాండేను ఎంచుకున్నారు.

 

కాగా ఈ సినిమా స్టోరీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే హైదరబాద్ నుంచి పారిపోయిన జంట ముంబై వెళతారు .. అక్కడ టెర్రరిస్ట్ ల దగ్గర ఇరుక్కుంటారు .. అలా సాగుతుంది అని టాక్. దీంతో ఈ స్టోరీ విన్న విజయ్ దేవరకొండ అభిమానులు..పూరి భయ్యా డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈ లైన్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: