టాలీవుడ్ లో ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా మీద ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకు సినిమా మీద అటు టాలీవుడ్ ఇటు నందమూరి, మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి కావడంతో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో బాహుబలి కన్నా పెద్ద హిట్ అవుతుంది  అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఈ తరుణంలో కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు.

 

 ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గితే త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నందమూరి, మెగా ఫాన్స్ కి రాజమౌళి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నందమూరి మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రం ఈ లుక్ కోసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాజమౌళి విడుదల చేస్తాడు అంటూ చిన్న వార్త వచ్చినా సరే ఆసక్తికరంగా చదువుతున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి వారికి బ్యాడ్ న్యూస్ వినిపించాడు. ఉగాదికి వస్తుందని భావించినా అయితే అప్పటికి రెడీ అవటం లేదు అని. 

 

ఇప్పుడు వైరస్ కారణంగా సినిమా షూటింగ్ మొత్తాన్ని పక్కన పెట్టేశారు అని, ఇప్పట్లో ఈ సినిమా పనులు కూడా మొదలయ్యే అవకాశాలు లేవని కాబట్టి ఉగాదికి ఫస్ట్ లుక్  విడుదల చేయటం లేదని, అయితే ఎన్టీఆర్ లుక్ లేదా రామ్ చరణ్ మాత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రామ్ చరణ్ బర్త్ డే ఈ నెలలో ఉంది కాబట్టి ఆయన ఈనెల 28న విడుదల చేసే సూచనలు కనబడుతున్నాయి. ఇదైనా వస్తుందా లేక అది కూడా వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: