కరోనా వల్ల మన దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో సినీ పరిశ్రమకు ఎంతో దెబ్బ పడింది.  అన్ని సినీ పరిశ్రమలు షట్ డౌన్ కావడంతో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇప్పుడు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా అన్ని సినీ షూటింగ్స్ క్యాన్సల్ అయ్యాయి.  చాలా సినిమాల రిలీజ్ ఆగిపోయాయి.  లాక్ డౌన్ ముగిసే వరకు తారలంగా ఇంట్లోనే సందడి చేస్తున్నారు.  ఈ సందర్భంగా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  అయితే సీనీ కార్మికుల కోసం చాలా మంది సినీ నటులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

IHG

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ ఖన్నా, షారూఖ్ ఖాన్ ఇలా అగ్ర హీరోలు తమ ఉదారత చాటుకున్నారు.  మరికొంత మంది సీనీ హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు కూడా విరాళాలు ఇచ్చారు. అయితే లాక్ డౌన్ సందర్భంగా స్టార్ నటులు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ధ‌ర్మేంద్ర అయితే ఏకంగా లోనావాలాలోని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో దుక్కిదున్ని పండ్ల‌ని పండిస్తున్నారు. నిన్న త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో దుక్కి దున్నిన భూమిని చూపిస్తూ వీడియోని షేర్ చేసిన ఆయ‌న తాజాగా త‌న ఫాం హ‌జ్‌లో పండిన అర‌టి,స‌పోటా పండ్ల‌ని చూపించారు.

 

మా పొలంలో పండిన అర‌టి,స‌పోటా, కొబ్బ‌రి ని చూస్తుంటే ఆనందంగా ఉంది. మీరు చూపించే ప్రేమ‌తోనే నేను ఇదంతా చేయ‌గలుగుతున్నాను.  ఈ ఫలాలు బయట ఎన్నో లబిస్తాయి కానీ... సొంతంగా పండించిన ఫలాలు తింటే ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అన్నారు.  న్ ఖాన్‌, సంజ‌య్ ద‌త్‌, ధ‌ర్మేంద్ర వంటి స్టార్స్ ప్ర‌స్తుతం త‌మ విలువైన స‌మయాన్ని ఫౌం హౌజ్‌ల‌లోనే  గ‌డుపుతున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: