థియేటర్లు బంద్ అవడం వల్ల ఓటిటి బిజినెస్ బాగా ఊపందుకుంది. అమేజాన్, నెటి ఫ్లిక్స్ లకు ధీటుగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మై హోం రామేశ్వర్ రావు కలిసి ఆహా అంటూ కొత్త ఓటిటి ఏర్పాటుచేశారు. అది అలా వచ్చిందో లేదో ఇలా 3 నెలలు లాక్ డౌన్ వచ్చింది. అయితే ఈ లాక్ డౌన్ లో అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ కు ఎన్ని సబ్ స్క్రైబర్స్, వ్యూస్ వచ్చాయో కొత్తగా వచ్చిన ఆహాని కూడా ప్రేక్షకులు అంతే ఆదరించారు. స్టార్ సినిమాలు ఇంకా అమేజాన్ ప్రైం కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 

 

అహా కోసం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ స్పెషల్ టాక్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా ఈ టాక్ షో ఉంటుందని తెలుస్తుంది. ఈ షోలో స్టార్స్ అందరితో తమన్నా ఇంటర్వ్యూస్, ఇంట్రెస్టింగ్ టాస్కులు ఉంటాయని తెలుస్తుంది. ముందుగా ఈ షో కోసం రాం చరణ్, అల్లు అర్జున్ లనే గెస్టులుగా వచ్చే ప్లాన్ చేస్తున్నారట. మెగా కాంపౌండ్ హీరోలు మొదలు పెడితే ఆ షొ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. తమన్నాతో రాం చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు సినిమాలు చేశారు. ఇప్పుడు తమన్నా హోస్ట్ గా చేస్తున్న టాక్ షోకి వాళ్లు గెస్టులుగా వస్తారని తెలుస్తుంది.

 

వీళ్లిద్దరే కాదు మిగాతా మెగా హీరోలు, టాలీవుడ్ క్రేజీ స్టార్స్ తో ఈ షో నిర్వహిస్తారట. ఇప్పటివరకు ఎలాంటి టాక్ షోలకు, ఇంటర్వ్యూస్ కు రాని స్టార్స్ ను సైతం తెచ్చి తమనా ముందు కూర్చో పెట్టే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి మిల్కీ బ్యూటీతో అల్లు అరవింద్ ఆహా అనిపించే ప్లాన్ చేశారని చెప్పొచ్చు.           

మరింత సమాచారం తెలుసుకోండి: