ఎన్నో విక్రమార్క ప్రయత్నాల అనంతరం అల్లు అర్జున్ డీజేతో స్టార్ట్ అయిన ఆమె విజయపరంపర అల వైకుంఠపురములో వరకు సాగింది. డీజే సినిమాతో ఆమె సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉంది. ఈమె ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్, అలానే అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో నటిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నారు. ఇవి కాక మరో రెండు బాలీవుడ్ మూవీస్ లో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
అయితే తాజాగా ఈమెకు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాలో ఈమె ఓ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించనున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్ తో సూర్యవంశి సినిమాని చేస్తుండగా...ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అలానే రోహిత్ శెట్టి-రణ్ వీర్ సింగ్ తో చేయనున్న తదుపరి సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే దీని మీద అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.