పవన్ తో క్రిష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే  పవన్ వకీల్ సాబ్ లేట్ అయ్యే అవకాశం ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కంటే ముందు వైష్ణవ్ తో సినిమా పూర్తి చేస్తానని షూటింగ్ షెడ్యూల్స్ కూడా ప్రకటించాడు క్రిష్. క్రిష్ సొంత బ్యానర్ లో నిర్మాణమవుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో చేసేది చిన్న సినిమా కావడంతో 40 రోజుల షూటింగ్ చేసి పూర్తి చేయాలని అనుకున్నాడు క్రిష్. రాకుల్ ని హైదరాబాద్ కి రప్పించి షూటింగు ప్రారంభించేశారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ కూడా జరుగుతోంది.

ఇంతలో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెర మీదకు వచ్చింది. గతంలో ఆమె డ్రగ్స్ వాదిందన్న విషయాన్ని రియా చక్రవర్తి ఎన్సీనీ అధికారులకి చెప్పినట్టు వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయంలో తన పేరు వాడుకుందా చూడాలని ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేసింది. అయితే ఆ మధ్య నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు పంపించి ఆమెను విచారించారు కూడా. దాని వలన కొన్ని రోజులు షూట్ క్యాన్సిల్ అయితే అయింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు కరోనా, భారీ వర్షాలను లెక్క చేయకుండా టాకీ భాగం మొత్తాన్ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారట. ఓ పాట బ్యాలెన్స్ ఉండ‌గా, దానికి ఐదు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ప్యాకప్ చెప్పేసారు కానీ మరో ఐదు రోజులు షూట్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో రకుల్‌ రైతు బిడ్డగా, గొర్ల కాపరిగా నటిస్తోంది. అంటే ఆమె పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఫస్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ మీద తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: