కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా అక్కడి మీడియా ప్రభాస్.. రాధే శ్యామ్ షూటింగ్ పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.రాధే శ్యామ్ సినిమాను దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మరియు బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇటలీలో లోని కొన్ని ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమా ని 2021 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.మొత్తానికి ఇటలీలో కూడా ప్రభాస్ ఫుల్ ఫేమస్ అయిపోతున్నాడు...!!