రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనేది ఇంకా సస్పెన్సు లోనే ఉంది. తోటి హీరో ఎన్టీఆర్ ఇప్పటికే rrr తర్వాత చేయబోయే సినిమాలను అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ని చేసేందుకు ఎన్టీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఏ సినిమాలో నటిస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వెంకీ కుడుముల, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి వంటి కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఎందుకో ఆ సినిమా లు ఇంకా ఫైనలైజ్ కాలేదు..

కానీ ఆచార్య సినిమా లో మాత్రం రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడన్నది మాత్రం నిజం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.. ఇందులో విలన్ గా అరవింద్ స్వామి నటిస్తుండగా సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఇటీవలే అయన షూటింగ్ లో పాల్గొనగా రామ్ చరణ్ ఆచార్యలో సుమారు ఆరగంట నుంచి నలభై నిమిషాల మధ్యలో కనిపించే అవకాశాలు ఉన్నాయట.ఈ సినిమా ని సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయాలనీ చూస్తుండడంతో  ఈ రెండు చిత్రాలమీదే చరణ్ కాన్సంట్రేట్ చేస్తున్నాడని అంటున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తేజ్ మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఆసక్తి గా ఉన్నారట.. అయన చేసిన తని ఒరువన్ సినిమా తెలుగులో ధ్రువ రామ్ చరణ్ చేసిన సంగతి తెలిసిందే..అయన టేకింగ్ కి మెచ్చిన చరణ్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయమని అదైగారట.. అంతేకాదు చిరంజీవి లూసిఫర్ ని కూడా అయన దర్శకత్వంలో రాబోతున్నట్లు చెప్తున్నారు..రీమేక్ సినిమా చేయడంలో ఆయన దిట్ట.. తెలుగులోని చాల సినిమాలు అయన తమిళ్లో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాడో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: