ఈ మధ్య టాలీవుడ్ హీరోల సినిమాలు ఏ రెండేళ్లకో, మూడేళ్లకో ఒకటి వస్తుంది. అందులో ప్రభాస్ పరిస్థితి మరి దారుణం బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు తీసుకున్నాడు. అయన సినిమా అంటేనే మూడేళ్లు మినిమం అంటూ అభిమానులు సైతం డిసైడ్ అయ్యారు. ఇది ప్రభాస్ అభిమానులకు ఒకింత అసంతృప్తి ని మిగిలిస్తుంది. ఇందుకు కారణం ప్రభాస్ సినిమాలు అన్ని భారీ బడ్జెట్ తో రూపొందించడమే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కూడా షూటింగ్ జరుగుతుంది. ఇది మేకింగ్ లో ఉండాగానే ఆదిపురుష్ చేయాలి ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా, ఇవన్నీ కూడా చాలా సమయం తీసుకునేలాగానే కనిపిస్తున్నాయి.




నాగ్ అశ్విన్ కన్నా ముందు రెండు సినిమాలు

కానీ ప్రభాస్ ఇకపై ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్లు తీసుకోవాలని అనుకుంటున్నాడట. వాస్తవానికి రాధేశ్యామ్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చిత్రం పట్టాలెక్కలి. కానీ ఇప్పుడు అది పక్కన పెట్టి ఆదిపురుష్ చేయాలనీ అనుకుంటున్నాడట ప్రభాస్. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా కూడా ఒకే చెప్పాడట. ఈ రెండు సినిమాలు అయ్యాకే నాగ్ అశ్విన్ సినిమా అంటూ ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అప్పటిదాకా వేచి చూడాల్సిందే




ప్రశాంత్ నీల్ సినిమా దాదాపు ఖాయం అయినట్టే కాబట్టి నాగ్ అశ్విన్ ని మరింత వెనక్కి నెట్టబోతుననట్టు ప్రచారం సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ చాల పెద్ద మొత్తంలో బల్క్ గా కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ సినిమా చేస్తున్న టైములో మరొక సినిమా కమిట్ కాలేడు. అందుకే ముందే ఈ సినిమాలన్నీ పూర్తి చేసి నాగ్ అశ్విన్ కి రూట్ క్లియర్ చేయాలనీ ప్రభాస్ భావిస్తున్నాడట. ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా 2022 లో సైతం ప్రారంభం అవుతుందో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినిమా పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: