యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా యూనిట్ మెంబర్స్ కు ప్రభాస్ సర్ ప్రైజ్ గిఫ్టులు ఇచ్చాడట. ఇంతకీ ప్రభాస్ ఇచ్చిన ఆ కానుకలు ఏంటి అంటే అది రిస్ట్ వాచ్ లని తెలుస్తుంది. రాధే శ్యాం టీం మొత్తానికి రిస్ట్ వాచ్ లు ఇచ్చి ప్రభాస్ తన మంచి మనసుని మరోసారి చాటుకున్నాడు.

అంతకుముందు తన పర్సనల్ ట్రైనర్ కు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రభాస్. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాకు పనిచేసిన టీం అందరికి కూడా ఖరీదైన రిస్ట్ వాచ్ లను ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడట. ప్రభాస్ ను అందుకే ఇండస్ట్రీలో అందరు డార్లింగ్ అంటారు. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్దేతో రొమాన్స్ చేస్తున్నాడు. సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే కనిపిస్తుంది.

పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధే శ్యామ్ సినిమా మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటన్నది చూపిస్తుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలు లైన్ లో పెట్టాడు. రాధే శ్యామ్ షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా సమ్మర్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వత సాహోతో ఆకట్టుకోలేని ప్రభాస్ రాధే శ్యామ్ తో మాత్రం రికార్డులు సృష్టిస్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: