ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలతో హవా  ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో బుల్లితెర షో లు  తెర మీదికి వస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసింది.  ఇలా తెర మీదికి వచ్చిన ఎంటర్టైన్మెంట్ షో లలో ఒకటి ఆలీతో సరదాగా.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని  తనదైన కామెడీతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. టాప్ కమెడియన్గా కొనసాగిన అలీ.. వ్యాఖ్యాతగా అవతారమెత్తి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరికీ ప్రతివారం సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇక ప్రతీ వారం కూడా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి కొత్త గెస్ట్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.  ఇక ఈ షో కి ఎంట్రీ ఇచ్చే సరికొత్త గెస్ట్ లను  ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ.. ప్రేక్షకులకు తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు కమెడియన్ అలీ. ఇటీవలే ఆలీతో సరదాగా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ఇది వైరల్ గా మారిపోయింది.




 ఇక ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ గా  కొనసాగి ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ కృష్ణభగవాన్. పృథ్వి రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర ప్రశ్నలతో అలీ ఇద్దరు కమేడియన్స్ దగ్గరనుంచి ప్రేక్షకులకు తెలియని విషయాలను రాబట్టారు . ఈ క్రమంలో ఇటీవలే మంచు ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పృథ్విరాజ్. మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు మనోజ్ వీళ్ళు ఎవరు  కాదు వీళ్ళకంటే మంచు లక్ష్మి గట్టిగా కొట్టిందని చెంప వాచిపోయింది అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.  ఇక అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే షో  వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: