మెగా ఫ్యామిలీ మేనల్లుడు ప్రముఖ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన'.ఈమధ్య కాలంలో ఈ సినిమాకి వచ్చినంత హైప్ ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రం ఇప్పటికి విడుదలయ్యి 14రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా కాని ఇంకా ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతూ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది.ఇక ఈ సినిమాకి హీరోయిన్ ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి.


ఇక విడుదల అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసింది ఈ సినిమా...ఇక ఈ సినిమా రెండు వారాలు పూర్తయ్యేసరికి రికార్డు స్థాయిలో కలెక్షన్లని రాబట్టింది. ఇక ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఏకంగా 46.66 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో 25.66 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. రెండో గురువారం నాడు కూడా ఈ చిత్రం 0.39 కోట్ల షేర్ ను రాబట్టింది. చూస్తుంటే.. ఈ వారంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లని రాబట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: