చాలా మంది నటీనటులు సినిమాను ఓ ఫ్యాషన్ గా భావిస్తుంటారు. అందులో నందమూరి నటసింహం ఒకరుగా చెప్పుకోవచ్చు. నటన నా రక్తంలోనే ఉందంటూ చెప్పుకునే ఈ నటసింహం ఏదైనా సినిమా లో నటిస్తున్నారంటే చాలు అందులో పరకాయ ప్రవేశం చేయడం పక్కాగా జరుగుతుంటుంది. పూర్తిగా ఆ పాత్రలో లీనమై పోతుంటారు ఈ నటసింహం. ముఖ్యంగా తను చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యే వరకు బాలయ్య  బాబు ఆ పాత్రదారిగానే రియల్ లైఫ్ లో కూడా మారిపోతారట. అయితే బాలయ్య బాబు అప్పట్లో నటించిన ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ సినిమా చేసేటప్పుడు కూడా ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యారట.
ఈ సినిమాలో పోలీస్ గా కనిపించిన బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బాలయ్యకు జోడీగా ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ డైరెక్టర్ బి. గోపాల్ ఈ మధ్యనే మీడియాతో పంచుకున్నారు. ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ మూవీ చేస్తున్న సమయంలో బాలయ్య నిజంగా పోలీస్ ఆఫీసర్ లాగే ఫీలయ్యారట. ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి అందులోనే జీవించేవారట. షూటింగ్ సాఫీగా సాగుతున్న సమయంలో బాలయ్య ఓ రోజు నాకు ఫోన్ చేశారు. ఈ రోజు నేను షూటింగ్ కు రావడం లేదని చెప్పేసారట.

దాంతో నేను ఎందురు రావడం లేదు బాబు.. ఏమైందసలు అని అడిగాను.  దానికి బాలయ్య నా ఇంటికి పోలీసు జీపు పంపిస్తే.. నేను దాంట్లో వస్తా.. లేదంటే రానని తేల్చి చెప్పారట. దాంతో నేను అలాగేనని చెప్పి వెంటనే షూటింగ్ లో ఉపయోగించే జీపును బాలయ్య ఇంటికి పంపాను. అయితే ఇంటినుంచే బాలయ్య పోలీసు దుస్తులు ధరించి లాఠీచేత పట్టుకుని.. ఆ జీపులోనే హుందాగా వచ్చారు. దాన్ని చూస్తే బాలయ్యకు నటన పట్ల ఉన్న అమితమైన ఇష్టం కనిపించిందని దర్శకుడు బి. గోపాల్. అందులోనూ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా బాలయ్య ఆ పాత్రలోనే లీనమయ్యాడన్న విషయాన్ని తెలిపాడు డైరెక్టర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: