గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక గొప్ప ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాడు .ఈ కార్యక్రమంలో సామాన్యుల తో పాటు రాజకీయ నాయకులు, సినిమా రంగానికి సంబంధించిన వారు మరియు ఇతర రంగాలకు చెందిన వారు కూడా మొక్కలు నాటి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో గొప్ప మైలురాయిని దాటింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబచ్చన్ గ్రీన్ ఇండియా పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున తో కలిసి అమితాబచ్చన్ మొక్కలు నాటారు. భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ని ప్రశంసించారు.


 ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ సెలబ్రిటీలతో సెల్ఫీలు కూడ దిగారు. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఒక రిటైర్డ్ సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరియు సినిమా కోసం నాగార్జున ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఇప్పటివరకు ఖరారు చేయలేదు. మరియు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న 'బంగార్రాజు' సినిమా లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు అమితాబ్ బచ్చన్ కూడా పలు సినిమా ప్రాజెక్టులతో బిజీ షెడ్యుల్ ని గడుపుతుంది. నాగార్జున, అమితాబచ్చన్ ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయినందుకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: