మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ’పై భారీ అంచనాలు పెరిగాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. మాస్ ఎంటర్‌ టైనర్‌ గా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక వార్త బయటికి వచ్చింది. అయితే అఖండ సినిమాను దసరాకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అయితే తాజాగా అఖండ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా దసరాకు రిలీజ్ కానుండటంతో చాలా సినిమాలు బరి నుంచి తప్పుకున్నాయి. కానీ ఒక్క సినిమా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా మాత్రం ఆర్ఆర్ఆర్‌ కు పోటీ పడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.
 
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన సినిమాలు.. సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మాస్ యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం ‘అఖండ’ సినిమా నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అఖండ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్, టీజర్ కూడా విడుదలైంది. టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. టాలీవుడ్‌ లో తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ దాటింది. దీంతో అఖండ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. పోస్టర్, టీజర్ విడుదలైన తర్వాత అభిమానుల్లో భారీ అంచనాలే పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: