అక్కినేని నాగార్జున హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు టాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా చేస్తున్న నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు.ఈ రెండు కూడా విభిన్న మైన జోనర్ చిత్రాలే కావడం తో నాగార్జున ఈ రెండు సినిమాలతో మంచి విజయం సాధిస్తున్నాడనే నమ్మకాన్ని పెట్టుకున్నాడు. దానికి తోడు ఆయన గత చిత్రాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడం తో ఈసారి భారీ హిట్ చిత్రాలు చేయాలని చెప్పి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఏదేమైనా ఈ రెండు సినిమాలతో నాగార్జున మంచి హిట్ కొట్టాలని ఆయన అభిమానులు ఎంతగానో భావిస్తున్నారు. ఆయన తోటి సీనియర్ హీరోలు భారీ చిత్రాలతో సక్సెస్ లు సాధిస్తుంటే నాగార్జున వెనకబడటం ఇండస్ట్రీ ప్రేక్షకులకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు. ఆ విధంగా సినిమా బాగుండాలని ఆయన బంగార్రాజు సినిమా విషయంలో భారీగా ఖర్చు పెడుతున్నారు అని తెలుస్తుంది. ఈ చిత్రానికి జి నెట్వర్క్ వారు నిర్మాతగా వ్యవహరిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ అక్కినేని హీరోలు కూడా ఈ చిత్రంపై భారీ నమ్మకం పెట్టుకోగా ప్రేక్షకులకు ఓ మరుపురాని అనుభూతిని కలిగించాలని చెప్పి ఈ చిత్రానికి భారీగా ఖర్చుపెట్టిస్తున్నాడట నాగార్జున. అయితే ఇంకొక వైపు ఈ విషయం లో టెన్షన్ కూడా పడుతున్నాడని తెలుస్తుంది. తమ మార్కెట్ ను మించి ఖర్చు పెడితే డబ్బు తిరిగి వస్తుందో లేదో అన్న టెన్షన్ ఆయన లో ఉందట. మరి నాగార్జున టెన్షన్ క్లియర్ అయ్యే విధంగా బంగార్రాజు చిత్రం భారీ వసూళ్లను సాధిస్తుందనేది చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది అన్న టాక్ వస్తుండగా అప్పుడు భారీ సినిమాలు ఉన్న నేపథ్యంలో నాగార్జున  స్కిట్ తీసుకుంటాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: