నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎస్ జే సూర్య గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ జే సూర్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందుకని దర్శకుడిగా అదిరిపోయే క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నాని సినిమాకు ఎస్ జే సూర్య దర్శకత్వం వహించాడు, అలాగే పవన్ కళ్యాణ్ తో మరోసారి కొమురం పులి సినిమాకు కూడా ఎస్ జే సూర్య దర్శకత్వం వహించాడు. కాకపోతే నాని మరియు కొమరం పులి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలయ్యాయి. ఇది ఇలా ఉంటే తమిళంలో కూడా ఎస్ జె సూర్య అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇలా దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎస్ జే సూర్య అనేక సినిమాల్లో నటించాడు కూడా.  ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్ జే సూర్య నటించిన మానాడు,  మరియు డాన్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

అలాగే ఈ సినిమాలో ఎస్ జే సూర్య నటనకు కూడా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ప్రస్తుతం నటుడిగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న ఎస్ జే సూర్య కు భారీ సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎస్ జె సూర్య కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఎస్ జే సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ఇదివరకు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహితుడు సినిమాలో కూడా ఎస్ జె సూర్య ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: