విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. వాటిలో ముందుగా లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన హీరో పోస్టర్ ఒకటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలా సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెంచిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలో తాను నటిస్తున్న మరొక సినిమాను విడుదల చేస్తూ ఉండడం విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతో సంతోష పెడుతుంది.

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకోగా డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆ సమయంలో లారెన్స్ కూడా తన సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉండడం వీళ్లిద్దరికి పోటీ తప్పదు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడుతుంది. హారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే లారెన్స్ తాజాగా రుద్రుడు అనే మరొక హారర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 

ఈ చిత్రం యొక్క అన్ని పనులు పూర్తి చేసుకొని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న మూడవ సినిమా జేజిఏమ్ ఆగస్టు 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా హీరో నేను సన్నివేశాలను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్ లో పాల్గొనబోతున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: