నందమూరి
కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన నటించిన
సినిమా విడుదల కాబోతోంది. ఫాంటసీ యాక్షన్
మూవీ గా తెరకెక్కుతున్న బింబి
సారా సినిమాలో ఆయన హీరోగా నటిస్తు ఉండగా చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో విడుదల చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, కేథరిన్
హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా
కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో చేసిన
సినిమా కావడం విశేశం.
ఐదవ సెంచరీ నాటి మగధ సామ్రాజ్య కాలానికి చెందిన రాజు గురించి ఈ
సినిమా ఉండబోతుంది. బింబీ సారుడిగా, సాధారణ యువకుడిగా
కళ్యాణ్ రామ్ ఇందులో రెండు భిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఇటీవల ఈ
సినిమా యొక్క టైలర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ
సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు
కళ్యాణ్ రామ్. ఈ కార్యక్రమంలో
కళ్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజువల్ గ్రాండియర్ తో తెరకెక్కిన ఈ
సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ అలరిస్తుందని ఆయన అన్నారు.
ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కూడా ఈ సినిమాపై బజ్ భారీ స్థాయిలో క్రియేట్ చేసింది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ విధంగా ఈ
సినిమా యొక్క రెండవ భాగం కూడా ఉంటుందని ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో
ఎన్టీఆర్ కూడా నటిస్తారని స్పష్టం చేశారు మొత్తం నాలుగు భాగాలుగా ఈ చిత్రం రాబోతుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా 2023 ఆగస్టులో ఈ రెండవ పార్ట్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఇదే
ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ
సినిమా విషయం లో
కళ్యాణ్ రామ్ మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది ఇప్పటికీ ఎవరికీ అంత చిక్కటం లేదు. మరి ఈ
సినిమా ఏ స్థాయిలో ఆయనకు విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఇది పాన్
ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ
సినిమా తర్వాత కూడా ఆయన డెవిల్ అనే మరొక సినిమాలో కూడా నటిస్తున్నాడు.