ఇక గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న నితిన్ రీసెంట్‌గా మాచర్ల నియోజక వర్గం చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి ఇంకా కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ ఇంకా ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి ఇంకా సుధాకర్ రెడ్డి నిర్మించారు. నితిన్ సీనియర్ హీరో కావడంతో అతని మార్కెట్ దృష్ట్యా.. నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు ఇంకా ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇంకా అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ జరిగింది.అయితే తొలి రోజు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చినట్టు హీరో నితిన్ చెప్పారు. చాలాకాలం తర్వాత నేను నా జోనర్‌ని మార్చి యాక్షన్‌లోకి వెళ్లాను.. ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు.


యాక్షన్ ఇంకా కామెడీ సీన్స్‌కి ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్‌ నాలో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సమయంలో ఇంత మంచి ఓపెనింగ్‌ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు నితిన్ . ''మా సినిమాని ఇంత గొప్ప సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి చాలా థ్యాంక్స్‌'' అన్నారు నిఖితా రెడ్డి. ''మా చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు'' అని అన్నారు రాజశేఖర్‌ రెడ్డి. ''మా చిత్రం తొలి రోజే రూ. 10కోట్లు వసూలు చేయడం అసలు మామూలు విషయం కాదు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అన్నారు కృతీ శెట్టి.వీళ్ళు పాపం ఇలా చెబుతున్నారే కానీ నిజానికి  'మాచర్ల నియోజకవర్గం’ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే వచ్చింది. అందుకే మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4.62 కోట్లు వసూలు చేసింది. తద్వారా నితిన్ నటించిన రీసెంట్ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా రికార్డు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: