వెంకట్ రామ్జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా కసండ్ర హీరోయిన్ గా రూపొందుతోన్న థ్రిల్లర్ మూవీ 'ఎవరు'. అయితే ఈ చిత్రం 'ది ఇన్ విజిబుల్ గెస్ట్ ' అనే స్పానిష్ చిత్రం ప్రేరణతో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆ మధ్య అడవి శేష్ చెప్పుకొచ్చాడు. కాగా తాజాగా ఈ సినిమా రెడ్ కార్పెట్ ప్రీమియర్ ను హైదరాబాద్ లోని ఆగష్టు 14వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రసాద్స్ లో వేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 'U/A ' సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తుండగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే 'ది ఇన్ విజిబుల్ గెస్ట్ ' కి ఈ సినిమా ప్రేరణ కాదు అని కాపీనే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల పై చిత్రబృందం ఎలా స్పందిస్తోందో చూడాలి. పైగా ఇదే స్పానిష్ చిత్రం ఆధారంగా బాలీవుడ్ లో 'బద్ లా' అనే చిత్రం వచ్చింది. ఇక ఎవరు సినిమా విడుదల తేదిని ఆగష్టు 23న నుంచి వారం రోజుల ముందుకు మార్చి.. సినిమాను ఆగష్టు 15నే రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందించాడట. అలాగే వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీవీపీ అండ్ అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో క్షణం అనే హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ రేకెత్తించే అంశాలతో పాటు సీరియస్ గా సాగే మర్డర్ కేసు గురించి చేసే విచారణ కూడా చాల బాగుంటుందని చిత్రబృందం చెబుతుంది. అలాగే రెజీనా, అడవి శేష్ మరియు నవీన్ చంద్ర పాత్రల మధ్య సాగే డ్రామా కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.