ఈరోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న ‘సాహో’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు కనివినీ ఎరుగని భారీ ఏర్పాట్లు చేసారు. ‘సాహో’ కోసం వాడిన రకరకాల కార్లు బైకుల కోసం ఒక ప్రత్యేకమైన స్టేజ్ తో పాటు సువిశాలమైన మరో స్టేజ్ ని ఈరోజు ఫంక్షన్ కోసం నిర్మించారు. 

ముందుగా ప్రభాస్ ఈ మూవీ కోసం ఉపయోగించిన కార్లు ఉన్న ప్రత్యేకమైన వేదిక పైకి వచ్చి అక్కడ మీడియా కెమెరాలకు పోజులు ఇచ్చి ఆతరువాత తన అభిమానులకు అభివాదం చేసి ప్రధాన వేదిక మీదకు వెళ్ళిపోతాడు. ఈ ఫంక్షన్ కు టాలీవుడ్ హీరోలు ఎవర్ని పిలవకుండా కేవలం ప్రధాన ఆకర్షణ ప్రభాస్ పైనే ఉండే విధంగా డిజైన్ చేసారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫంక్షన్ కు అతిధులుగా రాజమౌళి అల్లు అరవింద్ లను పిలిచినట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ ప్రముఖులు ఎవరు కూడ ఈ ఫంక్షన్ కు రావడం లేదని టాక్. దీనితో ఈ ఫంక్షన్ సక్సస్ అంతా ప్రభాస్ మ్యానియా పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఫంక్షన్ కు ప్రత్యేకంగా బాలీవుడ్ మీడియా ప్రతినిధులతో పాటు తమిళ కన్నడ మళయాళ రంగ మీడియా ప్రతినిధులను పిలవడమే కాకుండా ఈ ఫంక్షన్ తరువాత మీడియా ప్రతినిధులు అందరికీ ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీలోని ఒక హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నాడు అంటే మీడియాను ప్రభాస్ ఏవిధంగా మేనేజ్ చేస్తున్నాడో అర్ధం అవుతోంది. 

ఈరోజు ఫంక్షన్ కు ప్రభాస్ అభిమానులు కూడ చాల భారీ స్థాయిలో వస్తున్న నేపధ్యంలో వారి సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ ఫంక్షన్ సక్సస్ కోసం రామోజీ ఫిలిం సిటీ సాంకేతిక బృందం సహకారంతో చేసిన భారీ ఏర్పాట్లు ఈ ఫంక్షన్ ను టివిలలో చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాయి. ఇక నేటితో ‘సాహో’ మ్యానియా మొదలు కావడంతో ప్రేక్షకుల తీర్పు వచ్చే వరకు ఈ హడావిడి కొనసాగుతూనే ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: