ప్రముఖ బాలీవుడ్ విలన్ పాత్రధారి శక్తి కపూర్ తనయ శ్రద్ధ కపూర్, ఆషీకీ 2 అనే సినిమా ద్వారా కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, నటించిన తొలి సినిమానే అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు, నటిగా శ్రద్దకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత ఏక్ విలన్, ఎబిసిడి 2, బాఘీ, చిచ్చోరె, సాహో వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన శ్రద్ధ, నేడు ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, కెరీర్ పరంగా తనకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారట. 

అయితే శారీరకంగా మాత్రం తాను కొన్నేళ్ల నుండి ఒక వ్యాధితో సతమతమవుతున్నట్లు తలిపిందట శ్రద్ధ. తొలి సినిమా ఆషీకీ 2 చేస్తున్న సమయంలో తనలో ఏదో తెలియని మానసిక వేదన, యాంగ్జైటీ తో బాధపడేదానినని, అయితే ఆ తరువాత పలువురు డాక్టర్లను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించినప్పటికీ, తన సమస్య ఏమిటనేది వారికి అర్ధం కాలేదని ఆమె వాపోయింది. అయితే మెలమెల్లగా నాలో నేనే లోలోపల మనసులో ప్రశ్నించుకు నేదాన్ని, ఒక్కోసారి శరీరంలో ఏదో తెలియని బాధ, అసలు అది ఎందుకువస్తుందో కూడా అర్ధం అయ్యేది కాదంటూ ఆమె చెప్పారట. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం తనను తాను యోగ, ధ్యానం వంటివి ఎప్పటికపుడు క్రమంతప్పకుండా చేస్తూ, 

అలానే శరీరాన్ని ఎప్పుడూ శ్రమ చేస్తూ ఆ తరువాత రిలాక్స్ అవుతున్నానని, దానివలన తన వ్యాధి గతంతో పోలిస్తే చాలావరకు పర్వాలేదని ఆమె చెప్పారట. ప్రతి ఒక్క మానవుడు తన శరీరాన్ని, మనసుని అదుపులో పెట్టుకుని, ముందుకుగా మనసుని బాగా స్థిమిత పరుచుకుని, తనకు ఏమి కావలి అనేది అర్ధం చేసుకుని ఇవ్వగలిగితే, ప్రతి ఒక్కరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా శ్రద్ధ ఈ విధమైన వ్యాధితో సతమతం అవుతున్నారని తెలుసుకున్న ఆ ఫ్యాన్స్, ఆ వ్యాధి పూర్తిగా నయమవ్వాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: