డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశాడు. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ తన రెండో సినిమా 'రొమాంటిక్' చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచింది.
ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. చాలా సినిమాల తర్వాత హిట్ కొట్టడంతో పూరి - ఛార్మి మంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తమ సినిమా ఉంటుందని పూరి - ఛార్మి కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పూరి బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం కూడా రీమేక్ అవుతుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ చిత్రం రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది.