వచ్చే ఏడాది జరిగే గుజరాజ్ ఎన్నికలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించిన రాష్ట్రంలో మరో విజయం కూడా సాధించాలనేది నరేంద్ర మోదీ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది మోదీ, అమిత్ షా ద్వయం. కేంద్రం తరఫున సాధ్యమైనంత ఎక్కువగా నిధులను కేటాయిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నగరంలో నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఏకంగా నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించారు. ఆయనతో గుజరాత్లో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు తాజాగా 870 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాప్లెంక్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఎతైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో ఉంది. ముంబై-ఢిల్లీ బుల్లెట్ రైలు మార్గాన్ని కూడా గుజరాత్ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా రివర్ బే ఎయిర్ పోర్టులను కూడా గుజరాత్లోనే ఏర్పాటు చేశారు. ఇంత చేస్తున్నందున గుజరాతీలు తమకు మరోసారి అధికారం ఇస్తారనేది బీజేపీ నేతల ధీమా.
వచ్చే ఏడాది జరిగే గుజరాజ్ ఎన్నికలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించిన రాష్ట్రంలో మరో విజయం కూడా సాధించాలనేది నరేంద్ర మోదీ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది మోదీ, అమిత్ షా ద్వయం. కేంద్రం తరఫున సాధ్యమైనంత ఎక్కువగా నిధులను కేటాయిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నగరంలో నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ఏకంగా నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించారు. ఆయనతో గుజరాత్లో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు తాజాగా 870 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాప్లెంక్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఎతైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో ఉంది. ముంబై-ఢిల్లీ బుల్లెట్ రైలు మార్గాన్ని కూడా గుజరాత్ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా రివర్ బే ఎయిర్ పోర్టులను కూడా గుజరాత్లోనే ఏర్పాటు చేశారు. ఇంత చేస్తున్నందున గుజరాతీలు తమకు మరోసారి అధికారం ఇస్తారనేది బీజేపీ నేతల ధీమా.