టీవీ 5 మూర్తి అరెస్టు కాబోతున్నాడు..ఇప్పుడు ఇదీ మీడియా వర్గాల్లో సంచలన వార్త. మరి ఇంతకీ అసలు ఈ మూర్తి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి.. మూర్తి.. ఈయన పూర్తి పేరు డి.హెచ్.వీ. సత్యనారాయణ మూర్తి.. ఈయన సొంతూరు తూర్పు గోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన కరప గ్రామం. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. మూర్తికి జర్నలిజం అంటే ప్రాణం.. పిచ్చి.. ప్యాషన్.. జర్నలిస్టుని అని గర్వంగా చెప్పుకోవడం ఇష్టం.

 

 

ఆయన పాత్రికేయ జీవితం ఈనాడుతో ప్రారంభమైంది. ఈటీవీ 2 ఛానల్ రాకతో అది మరింత జోరందుకుంది. విజయవాడ ఈటీవీ న్యూస్ ఛానల్ ఇన్‌చార్జ్‌ గా చక్కని పనితీరు కనపరిచారు. అనేక సంచలన కథనాలు అందించారు. విజయవాడ రిపోర్టర్ గా ఈటీవీలో ప్రస్థానం ప్రారంభించిన మూర్తి.. ఆ తర్వాత హైదరాబాద్ బ్యూరోలో కీలక పాత్ర పోషించారు. బ్యూరో చీఫ్ గానూ బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో అనేక సంచలన కథనాలు అందించారు.

 

 

ఆ తర్వాత మూర్తి ఎన్‌టీవీ, ఏబీఎన్‌ ఛానల్‌లోనూ, మహాటీవీలోనూ.. ప్రస్తుతం టీవీ5 లోనూ పని చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో దమ్ము, కసి, నిబద్దత, నిజాయితీ ఉన్న అతి కొద్ది మంది జర్నలిస్టుల్లో మూర్తి ఒకరు. అయితే వ్యక్తిగతంగా ఆయన నిజాయితీని వృత్తినిబద్దతను శంకించే అవకాశం లేకపోయినా.. ఆయన పని చేసిన వార్తా చానళ్ల మేనేజ్‌మెంట్ల కారణంగా ఆయన పనితీరు నిష్పాక్షితం అని చెప్పడం అవాస్తవమే అవుతుంది.

 

 

ఏబీఎన్ ఛానళ్లోనూ పని చేసినప్పుడు, మహాటీవీలో చేసినప్పుడూ.. ప్రస్తుతం టీవీ5లో పని చేసినప్పుడూ.. ఈ అన్ని ఛానళ్లూ వైసీపీకి వ్యతిరేకమైనవే కావడం విశేషం. అందువల్ల ఆయన బాధ్యతలపై ఆయా ఛానళ్ల యజమానుల ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయి. ఇప్పుడు అవే మూర్తి అరెస్టు వరకూ దారి తీస్తున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా మూర్తిలాంటి జర్నలిస్టును అరెస్టు చేస్తే.. అది ఏపీ సర్కారుకు అంత మంచి పరిణామం మాత్రం కాబోదన్నది మీడియా వర్గాల్లో వినిపిస్తున్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: