ఆడపిల్లలు బయట తిరిగితే రక్షణ లేదని హాస్టల్ లో ఉంచి చదివిస్తూ వస్తున్నారు తల్లి దండ్రులు.. అంతే కాక కాలేజీ వాళ్ళు ఇచ్చే భరోసా వల్ల వాళ్లు అక్కడ వదిలేసి వెళ్తారు.. అలాంటి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పై వాచ్ మెన్ అత్యా చారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది. నలుగురు అమ్మాయిలను దారుణం గా రేప్ చేశాడని దర్యాప్తు లో తేలింది..
వివరాల్లోకి వెళితే..తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు లోని స్వధార్ హోం వార్డెన్ అరుణ, వాచ్మెన్ రెడ్డి బాబును విధుల నుంచి తొలగించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు లో స్వధార్ గృహం లో వాచ్మెన్ నలుగురు యువతుల పై అఘాయిత్యాలకు పాల్పడినట్లు వెలుగు లోకి వచ్చిన విషయం తెలిసిందే.
వాచ్మెన్ వేధింపులు ఎక్కువ కావడం తో తీవ్ర మనో వేదనకు గురైన బాధితులు రెడ్డిబాబు చర్యల పై పోలీసుల కు ఫిర్యాదు చేశారు. స్వధార్ గృహంలో యువతులపై వాచ్మెన్ అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్ స్పందించారు. బాధిత యువతులను, మహిళలను ప్రభుత్వాస్పత్రి లో బుధవారం పరామర్శించారు.
విషయానికొస్తే బాధితులతో తానేటి వనిత మాట్లాడుతూ..మేనేజర్ రమణాశ్రీని సస్పెండ్ చేశామని వెల్లడించారు. బాధితులైన నలుగురు యువతులతో మరో నలుగురిని వేరే స్టేట్ హోంకు తరలిస్తామని తెలిపారు. స్వధార్ గృహంలో సీసీ కెమెరాలను వాచ్మెన్, వార్డెన్ కలిసే నిలిపి వేశారని వివరించారు. వాచ్మెన్ రెడ్డిబాబును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మహిళలందరూ ధైర్యంగా, భరోసాగా ఉండేందుకే దిశ చట్టాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు.ఇలాంటి ఘటనలు మళ్లీ పునవృతం కాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు..