ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ తొలుత చైనాలోనే పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు నెలల నర్కయాతన అనుభవించిన ఆ దేశం… సరిగా ఏప్రిల్ నెల రెండవ వారంలో తమ దేశంలో ఎక్కడా కొత్త కోవిడ్-19 మరణాలు కానీ కేసులు కానీ కొత్తగా నమోదు కాలేదని ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత చైనా ఎంత అనూహ్యంగా కోలుకుందో.. అంతే అనూహ్యంగా మరలా ఈ ప్రాణాంతక వైరస్ దెబ్బను చవిచూచింది.
ఛైనా లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కరోనా రెండవ వేవ్ ఇన్ఫెక్షన్ మొదలైంది. ఇది కరోనా వైరస్ లో రెండవ రకంగా ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ రెండవ సారి వణికిస్తున్న ఈ వైరస్ ఏ దేశం నుండి మరలా ఇక్కడ ప్రబలిందో వారికి అర్థం కావడం లేదు.
ఇదిలా ఉండగా రాజధాని బీజింగ్లో భారీగా కేసులు నమోదవుతుండటంతో నగరంలోని 90 వేల మంది స్థానికులకు కరోనా నిర్దారణ పరీక్షల చేయాలని భావించి.. సోమవారమే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్థానిక షిన్ఫడీ హోల్సేల్ మటన్ మార్కెట్ను సందర్శించినవారిలో పలువురికి కొవిడ్ పాజిటివ్గా తేలుతున్న నేపథ్యంలో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్డౌన్ను విధించింది.
చైనాలో గత 24 గంటల్లో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 42 ఒక్క బీజింగ్లోనే నిర్ధారణ కావడం గమనార్హం. ఇక పోతే ఏప్రిల్ 7 నాటికి, 81,740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 3,331 మంది చనిపోయారని చైనా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు కాస్తా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీంతో చైనా వారు ఒక్కసారిగా బీజింగ్ నగరంలోని స్కూళ్ళు అన్నింటినీ మూసివేయడం జరిగింది. ఒకే సారి బీజింగ్ ఎయిర్ పోర్టులో ఉన్న ఫలంగా 1200 విమానాలను రద్దు చేశారు.