కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసే విషయంలో దూకుడుగా వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం ఉందో వాళ్లందరికీ కూడా మంత్రి కేటీఆర్ ఫోన్లు చేస్తున్నారు. దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా సమాచారం. త్వరలోనే ఎమ్మెల్యేల ప్రచారం లోకి రావాలని లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీని ముందుకు అడుగులు వేయకపోతే మాత్రం అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు.
కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందని ఆయన ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఎవరూ కూడా నిరాశ పడవద్దు అని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పార్టీలో ప్రభుత్వంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని కాబట్టి మంత్రి పదవుల విషయంలో ఇతర పదవుల విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. దీనితో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రచారం లోకి రావటానికి కాస్త ఆసక్తి గా ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి.