ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనపర్తి నియోజిక వర్గం, రామవరంలో పర్యటిస్తున్న లోకేష్.. జగన్ రెడ్డి కాదు ఆయన "జాంబీ రెడ్డి " అంటూ తనదైన శైలిలో విమర్శించారు. సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వారికి ఆనందం వస్తుంది. కానీ  జాంబీ రెడ్డి గారికి అలా కాదు.. ఈయన గారికి టిడిపి నేతలు,కార్యకర్తల మీద కేసులు పెట్టడం,అరెస్ట్ చెయ్యడంలో ఆనందమేస్తుందంటూ అన్నారు. 

ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న ఈ జాంబీ రెడ్డి  రెండేళ్ల పాలనలో 25 మంది కార్యకర్తలను హత్య చేయించాడని అన్నారు. ఇక ఇంతవరకు అనపర్తి నియోజిక వర్గంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరగలేదని లోకేష్ ద్వజమెత్తారు. ఈ నియోజిక వర్గం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి..ఆయన డాక్టర్ కాదు..యాక్టర్ సూర్య నారాయణ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఈ యాక్టర్ సూర్యనారాయణ అవినీతిని టీడీపీ నేత ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి ఆధారాలతో సహ బయటపెట్టారు అని లోకేష్ చెప్పుకొచ్చారు.

 కాపవరంలో 400 కోట్ల విలువ గల గ్రావెల్ మాఫియా, నాగార్జున ఫార్టీలైజర్ కు సంబంధించిన భూముల వ్యవహారం, వంటి అవినీతి అక్రమాలను రామకృష్ణ రెడ్డి ఆధారాలతో బయటపెట్టరాని, అందువల్ల ఆయనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారని మండిపడ్డారు. ఆఖరికి బెయిల్ వస్తే టిడిపి నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారని, చెయ్యని తప్పులకు టీడీపీ కార్యకర్తల పై కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేష్ మండి పడ్డారు. రాబోయే రోజుల్లో జాంబీ రెడ్డి,యాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కి జైలు లో చిప్ప కూడు ఖాయం. నా పై కేసులు పెట్టండి బరిస్తా...నన్ను అరెస్ట్ చెయ్యండి బాధపడను...నా కార్యకర్తల జోలికి వస్తే ఎవ్వడిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ఇచ్చేస్తా.. అంటూ నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: