ఇలా కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఎంతో మంది వైద్యులు సైతం వైరస్ బారిన పడి చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కేవలం కరోనా వైరస్ బారిన పడినవారికి కాదు.. ఇక వివిధ రకాల వ్యాధులతో లేదా సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు వచ్చిన వారికి కూడా ఎంతో మంది వైద్యులు ప్రాణాలు నిలబెట్టి కలియుగ దైవం గా మారిపోయారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల చిన్నారి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడింది. దీంతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ప్రాణం ఎక్కడ పోతుందో అని ఆ తల్లి గుండె శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో ఆ తల్లికి ఏం చేయాలో తెలియలేదు. చివరికి డాక్టర్లను బ్రతిమిలాడుతూ ఏడుస్తూ ఉంది.
దీంతో అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది ఏకంగా మూడు రోజుల బాబును ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాబు పుట్టాడు ఇక అనారోగ్యం వల్ల ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇక వరంగల్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆంబులెన్స్ లో వెళ్తుండగా ఆ చిన్నారి గుండె ఆగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ ద్వారా మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ చిన్నారి.