బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న తెలుగు స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 30న వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినిమా అభిమానుల‌ను షేక్ చేసేందుకు థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభాస్ పలు భాషల్లో సినిమా విడుదల నేపధ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక కోలీవుడ్‌లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌డంతో త‌మిళంలోనూ ప్ర‌మోష‌న్ కోసం ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలోనూ ఓ త‌మిళ్ యాంక‌ర్ ప్ర‌భాస్‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌ర్ గురించి చెప్పాల‌ని అడిగాడు. 


జ‌గ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నికల్లో 151సీట్లతో రికార్డు మెజారిటీ దక్కించుకుని... జగన్ దేశవ్యాప్తంగా పొలిటికల్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే తమిళ‌నాడు జ‌గ‌న్‌ను పొలిటిక‌ల్ బాహుబ‌లిగా పిలుస్తున్నార‌ని.. ఆయ‌న గురించి మీరు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ బ‌దులిస్తూ రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు.. అయితే యంగ్ సీఎంగా ఆయన చాలా బాగా చేస్తున్నాడని కితాబు ఇచ్చాడు.


జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఆంధ్రప్రదేశ్ హయాంలో బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తాడనే నమ్మకం తనకు ఉన్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో కూడా జ‌గ‌న్‌కు తెలుస‌ని ప్ర‌భాస్ చెప్పాడు. ఏదేమైనా ఏపీ సీఎంపై ప్ర‌భాస్ పాజిటివ్‌గా చేసిన ఈ వ్యాఖ్యుల ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీ వాళ్లు అయితే ప్ర‌భాస్ మాట్లాడిన వ్యాఖ్య‌ల వీడియోను షేర్ చేస్తూ ప్ర‌భాస్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: