ఓ వైపు జగన్ ప్రభుత్వ పాలన బహు బేషుగ్గా ఉందంటూ పలువురు  ప్రశంసిస్తుంటే టిడిపి మాత్రం జగన్ చేసిన ప్రతి పనిపై  ఏదో ఒక ఆరోపణలు చేస్తూ చూస్తూనే ఉంది. అయితే టిడిపి ఎన్ని  విమర్శలు  చేసిన వాటిని మాటలతో కాదు చేతులతోనే తిప్పి కొడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే తాజాగా టిడిపి మహిళా నేత పంచమర్తి అనురాధ  జగన్ పై  విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో తిరిగే ధైర్యం  లేదని... ఆయన మానసిక స్థితిపై కూడా సందేహాలు కలుగుతున్నాయి అని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో కూడా వైసిపి సర్కారుపై విమర్శలు వస్తున్నాయని ... ఏపీ ప్రభుత్వం ప్రతి అంశంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. అయితే జగన్ కు పట్టిన దయ్యాన్ని వదిలించే రోజు దగ్గర్లోనే ఉందని పంచుమర్తి అనురాధ విమర్శించారు . అసెంబ్లీలో అరుస్తూ గట్టిగా చెప్పినంత  మాత్రాన అబద్ధాలు నిజం కాదని హితవు పలికారు.

 

 

కాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సచివాలయం పరీక్షల రగడ  నడుస్తుంది. లక్ష ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసి జగన్ చరిత్ర సృష్టించారని పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే ... ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉద్యోగానికి ఐదు లక్షలు తీసుకొని పరీక్ష  పేపర్లు లీక్ చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని చూసి ఓర్వలేక ప్రతిపక్ష టిడిపి అనవసర రాద్ధాంతం చేస్తుందని వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: