ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా మొన్నటి వరకు జరిగిన సూపర్ 12 మ్యాచ్లలో అటు భారత జట్టు ఎంతో అద్వితీయమైన విజయాలను సాధిస్తూ దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లీగ్ దశలో ఆడిన 5 మ్యాచ్ లలో కూడా నాలుగు విజయాలు సాధించి ఏకంగా గ్రూప్-2 నుంచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో కూడా భారత జట్టు విజయం సాధించడం ఖాయమని ఎంతోమంది అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.


 ఎంతో అలవోకగా అటు భారత జట్టు ఫైనల్ కి వెళుతుందని అక్కడ మరోసారి చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్తాన్ ను మట్టి కరిపిస్తుంది అని ఎంతోమంది భావించారు. కానీ ఊహించని రీతిలో కీలకమైన సెమీఫైనల్ అడుగులోనే తడబడింది భారత జట్టు.  ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్తో శాయ శక్తుల ప్రయత్నించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు 296 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.


 అయితే ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం టాప్స్ స్కోరరుగా ఉన్న నేపథ్యంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ టాప్స్ స్కోర్స్ చేసినప్పుడల్లా కూడా కీలకమైన మ్యాచ్లో ఓడిపోయింది అన్న విషయం తెరమీదకి వచ్చింది. 2014 వరల్డ్ కప్పులో 319 పరుగులు చేశాడు. ఇక అప్పుడు ఫైనల్లో లంకపై ఇండియా ఓడింది. 2016లో కూడా 273 పరుగులతో టాప్లో ఉండగా.. సెమిస్ లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓండింది. ఇక ఇప్పుడు మరోసారి 296 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా మరోసారి ఇండియా సెమీస్ నుంచి ఇంటిబాట పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: