మొన్నటి వరకు  కరోనా వైరస్ నిబంధనల కారణంగా ఆటగాళ్లు ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట ప్రపంచంతో పని లేకుండా కేవలం ఒక హోటల్ గదికి మాత్రమే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో తీవ్రమైన ఒత్తిడి మధ్య క్రికెట్ ఆడుతూ అందరికీ ఎంటర్టైర్మెంట్ పంచారు. కానీ ప్రస్తుతం  కరోనా పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో ఇక క్రికెట్ ఆటగాళ్లు అటు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఇక ఏదైనా దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అన్ని ప్రాంతాలను కూడా సందర్శిస్తూ ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక క్రికెట్ మ్యాచ్ లో ఉండే ఒత్తిడిని ఇలా సరదాగా గడపడం ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.



 అయితే సాధారణంగా మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో అగ్రే సివ్ గా ఉంటూ.. ఒకరిని ఒకరు కవ్వించుకునే క్రికెట్ ఆటగాళ్లు మైదానం బయట మాత్రం స్నేహితులుగా ఉంటూ కలిసిమెలిసి తిరుగుతారు అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ లోని భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలు టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమై రేపటి నుంచి ఇక ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది.


 టి20 సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ కూడా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడబోతుంది టీమిండియా అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ కెప్టెన్ కే అని విలియమ్సన్ భారత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి సరదాగా రిక్షా సవారీ చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.  మ్యాచ్ ముంగిట వెల్డింగ్టన్ రోడ్లమీద సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ఇలా ప్రత్యర్థి జట్ల సారధులను ఇలా సరదాగా చూడటం గొప్పగా ఉంది అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: