టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తన ఆట తీరుతోనే కాదు తన ప్రవర్తనతో కూడా కోట్ల మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. తీవ్ర ఒత్తిడి సమయంలో కూడా మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే మహేంద్రసింగ్ ధోని.. తన వ్యూహాలతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకోగల సమర్థుడు అని చెప్పాలి. ఇక అలాంటి ప్రతిభ ఉంది కాబట్టే ఏకంగా టీమ్ ఇండియాకు ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు మహేంద్రసింగ్ ధోని. తనకంటూ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు.



 అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మహేంద్రసింగ్ ధోనిని మరింత దగ్గర చేసింది అని చెప్పాలి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు ఇక మైదానం బయట కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. అటు సమాచారం ఆటగాళ్లను ఆటపాటించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ధోని ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు అన్నది మాత్రం మరోసారి నిరూపితం అయింది అని చెప్పాలి. ఐపిఎల్ లో భాగంగా చెన్నై, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోని సేన విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.



 ఇక మ్యాచ్ చివర్లో మహేంద్రసింగ్ ధోని కొట్టిన రెండు సిక్సర్లు కూడా మ్యాచ్ మొత్తానికి కూడా హైలెట్ గా మారిపోయాయి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన లక్నో ఆటగాడు కృష్ణప్ప గౌతం భార్య కూతురుతో కలిసి ధోనీని కలిశాడు. ఈ సందర్భంగా కృష్ణప్ప గౌతమ్ కూతురిని ధోని తన స్టయిల్ హై ఫై ఇచ్చాడు. కాసేపు తను కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి పాపతో సందడి చేశాడు. దీంతో లక్నో ప్లేయర్ కృష్ణ గౌతమ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: