ఇక తాజాగా సౌతాఫ్రికాలో ఓటమి పై కె.ఎల్.రాహుల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో మార్పు ఎంతో అవసరమని రాహుల్ చెప్పుకొచ్చాడు. 4,5 ఏళ్ల నుంచి జట్టు ఎంతో సమర్థవంతంగా రాణి రాణిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం జట్టు మరింత మెరుగ్గా రాణించాలంటే తప్పనిసరిగా మార్పు అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియాకు కెప్టెన్గా అవ్వాలి అనే కల సహకారం అయింది. ఇంతకుమించిన గౌరవం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.. దక్షిణాఫ్రికాలో ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది అంటూ తెలిపాడు.
అయితే జట్టును సమర్థవంతంగా నడిపించగలనూ అన్న నమ్మకం నాకు ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనే నేను అనుకోవడం లేదు. కానీ జట్టుగా మేము ఇంకా మంచి ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది అంటూ కె.ఎల్.రాహుల్ తెలిపాడు. ఇక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ కె.ఎల్.రాహుల్ అన్నాడు. అయితే విజయాల నుంచి కాదు పరాజయాల నుంచే ఎన్నో నేర్చుకుని మరింత మెరుగ్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే అన్ని విషయాలను నేర్చుకుంటున్నాను అంటూ కె.ఎల్.రాహుల్ చెప్పుకొచ్చాడు.