కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా నుంచి పుట్టుకోచ్చిన ఈ మహమ్మారీ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. అంతే కాకుండా ఎన్నో లక్షల ప్రాణాలని బలి తీసుకుంటూ ఎన్నో కుటుంబాలని కూడా రోడ్డున పడేసింది ఈ కరోనా వైరస్. ఇక ఈ కరోనా వైరస్ ప్రభావంతో పలు దేశాల్లో లాక్ డౌన్ పెట్టడం జరిగింది. ఇక మన దేశంలో కూడా సుధీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. ఇక ఈ లాక్‌డౌన్‌లో ఈ కరోనా వైరస్ ఎంతోమందిని రోడ్డు పడేసింది. చాలామంది ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. మళ్లీ సామాజికంగా, ఆర్థికంగా పుంజుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ భయంకరంగా వ్యాపిస్తోంది. దీంతో జనాలు బిక్కుబిక్కున కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితి ఎంతో మంది కూలీలకు పని లేకుండా చేస్తోంది. పేదలు ఆకలి దప్పికలతో అల్లాడుతున్న ఈ తరుణంలో తమిళనాడుకు చెందిన ఓ మహిళ పేదల కడుపు నింపేందుకు ముందుకొచ్చింది. ఆకలేస్తుందని చెబితే చాలు.. అమ్మలా అన్నం పెడుతుంది. వేడి వేడి బిర్యానీ ఇచ్చి ఆదుకుంటోంది.


కొయంబతూర్‌లోని పులియాకులాం ప్రాంతంలో ఉన్న స్టాల్ ముందు ఉన్న ఓ బ్లాక్ బోర్డు అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ‘‘మీకు ఆకలిగా ఉందా? ఇక్కడికి వచ్చి కడుపు నింపుకోండి’’ అని దానిపై రాసి ఉంది. ఈ స్టాల్ ఫొటోలను తమిళనాడుకు చెందిన రేడియో జాకీ, ‘అమ్మోరు తల్లి’ సినిమా హీరో, దర్శకుడు ఆర్.జె. బాలాజీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో నెటిజనులు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందని చెప్పేందుకు ఈ మహిళే నిదర్శనమని కొనియాడుతున్నారు.నిజంగా ఆకలితో వున్న వాళ్లకి అన్నం పెట్టేవాళ్ళు అమ్మతో సమానం అని మరోసారి రుజువు అయ్యింది.ప్రస్తుతం ఈ మంచి న్యూస్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: