ఒక పక్క కరోనవస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటే ఎవరికి కూడా పెద్దగా దాని తీవ్రత ఏ మాత్రం కూడా అర్ధం కావడం లేదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో కొందరు వ్యక్తులు చేసిన పని తీవ్ర దుమారం రేపుతుంది. లాక్ డౌన్ ఉన్నా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే బర్త్ డే పార్టీ చేసుకున్నారు.

 

హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ మాదన్నపేట లో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. అక్కడి నుంచి కరోనా వేగంగా విస్తరించింది అని అధికారులు గుర్తించారు. మొత్తం ఇక్కడి నుంచి 5 మందికి కరోనా రాగా 23 మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: