ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఏపీ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కరోనా ఆస్పత్రులను సిద్దం చేయడమే కాకుండా కేసులు పెరిగితే ఏం చెయ్యాలి అనే దాని మీద సమీక్షలు చేస్తున్న సిఎం జగన్ అవసరం అయితే కేరళ నుంచి నర్సులను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

 

కేరళలో ఉండే నర్సులకు కరోనా కట్టడిలో అనుభవం ఉన్న నేపధ్యలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతి తీసుకుని వారిని ఏపీ తీసుకొచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరి తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: