ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా నకీలీ పురుగు మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కొందరు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయవాడలో భారీగా పురుగు మందులు నకిలీవి తయారు చేసే వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. గుంటూరు, కృష్ణా జిల్లాల కేంద్రంగా నకిలీ పురుగుల మందులను ఒక ముఠా తయారు చేస్తుంది. 

 

వారిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం తో అరెస్ట్ చేసారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక వారి నుంచి దాదాపుగా 4.5 కోట్ల విలువ చేసే పురుగు మందులను స్వాదీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: