ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశాలకు గడువును పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. అర్హత సాధించిన వారిలో మూడొంతుల అభ్యర్థులు ఐచ్ఛికాలు ఇవ్వకపోవడంతో.. మరోసారి అవకాశం కల్పించడానికి నిర్ణయించామని తెలిపారు.

ప్రాసెసింగ్ రుసుమును ఈ నెల 21 వరకు చెల్లించవచ్చని నాయక్ వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాల కోసం ఈ నెల 22 వరుకు గడువు ఇస్తున్నామన్నారు. పాలిసెట్​లో 60,780 మంది అర్హత సాధించగా.. 35,346 మంది మాత్రమే ఐచ్ఛికాలు సమర్పించారన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: