దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతున్న వేళ తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.. మాస్క్​లు ధరించటం, భౌతిక దూరం పాటించాలని పలు సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలను కోరారు. అయినా.. కొవిడ్​ నిబంధనలు బేఖాతరు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనే బెంగళూరు కేఆర్​ మార్కెట్​లో కనిపించింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా-దీపావళి పండుగ సీజన్​ నడుస్తోంది. పండుగల వేళ గృహోపకరణాలు, ఫోన్లు, దుస్తులు సహా ఇతర వస్తువల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు ప్రజలు.


 ఈ క్రమంలోనే బెంగళూరు కేఆర్​ మార్కెట్​కు వందలాది మంది తరలిరావటంతో రద్దీగా మారింది. చాలా మంది మాస్కులు లేకుండా కనిపించటం గమనార్హం. భౌతిక దూరం నిబంధన మచ్చుకైనా కనిపించలేదు.మార్కెట్​కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావటం వల్ల బృహత్​ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) మార్షల్స్​ రంగంలోకి దిగారు. కానీ, వారు కూడా నియంత్రించలేకపోయారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: