విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో నిన్న భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న గున్న మామిడి ఆటవీప్రాంతంలో  కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారస పడ్డారు. అక్కడ కొన్ని ట్యాబ్ లు, స్టార్ గుర్తు ఉన్న టోపీలు లభించడంతో, మావోయిస్టు అగ్రనేత లైన జగన్, అరుణ, సుధీర్ లు తప్పించుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

రెండు గంటల పాటు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక వారు పరరయ్యాక ఘటనా స్థలంలో ఐడిలు, 11 బ్యాగులు, క్యారేజీలు, ఇన్సాస్ చెందిన 15 రౌండ్లు ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు,  32 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. తెలంగాణాలో తమ సత్తా చూపుకున్న మావోయిస్టులు ఏపీలో కూడా ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నారు పోలీసులు. దీంతో వారు మావోల వేటలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: