తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా అడుగులు వేస్తుంది. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉండవచ్చో గాని బిజెపి మాత్రం ఇప్పుడు తెలంగాణాలో చాలా వరకు ఫోకస్ చేసింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది అని తెలంగాణా బిజెపి వర్గాలు వెల్లడించాయి.

గ్రేటర్ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు వివరించనున్న బండి సంజయ్... భవిష్యత్తు ప్రణాలికలపై కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. గ్రేటర్ హైద్రాబాద్ లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు, ప్రకాష్ జావడేకర్,స్మ్రితి ఇరానీ సహా పలువును కలసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. మరి కొంత మంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: