3వ విడత వైఎస్ఆర్ వాహనమిత్ర కింద సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు 10 వేల ఆర్ధిక సాయం విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. క్యాంప్ ఆఫీస్ లో బటన్ నొక్కి సాయం విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర అమలు చేశామని వెల్లడించారు. 


ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో చూశానని పేర్కొన్న జగన్‌. టీడీపీ హయాంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధించారని అన్నారు. ఇక మూడు వేల కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామని,  2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు నేడు జమ చేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: