మా ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పదవీకాలం పూర్తి కావడంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ 15 మంది మా ఎగ్జిక్యూటివ్ సభ్యులు కృష్ణంరాజుకు లేఖరాశారు. గతంలో కూడా ఎగ్జిక్యూటివ్ సభ్యులు కృష్ణంరాజుకు మా ఎన్నికలు నిర్వహించాలంటూ లేఖరాశారు. అయితే ఆ లేఖకు ఎలాంటి సమాధానం లేకపోవడంతో మరో సారి మా ఎన్నికలు నిర్వహించాలంటూ లేఖను రాశారు. మరోవైపు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రేపు వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా గతంతో పోలిస్తే ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో మా ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. దానికి కారణం గతంలో ఎన్నికల్లో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే పోటీ చేసేవారు. కానీ ఈసారి ఏకంగా ఐదుగురు సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. వారి లో జీవిత, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహ రావు ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు మధ్య పోటీ ప్రధానంగా ఉండబోతోందని తెలుస్తోంది. మరోవైపు రేపు జరగబోయే సమావేశం లో ఏకగ్రీవం పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: