ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనా కార‌ణంగా ఆదివారం రాత్రి మృతి చెందిన విష‌యం విధిత‌మే. అయితే ఆయ‌న మృతి ప‌ట్ల టాలీవుడ్ మెగాస్టార్  చింర‌జీవి సంతాపం ప్ర‌క‌టించారు. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ మృతి చెందిన వార్త  విన‌గానే త‌నను  ఎంతో క‌లిచి వేసిన‌ద‌ని చిరంజీవి పేర్కొన్నారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ కు తీరని లోటు అని, ఆయ‌న లేర‌నే వార్త విన‌సొంపుగా లేద‌న్నారు మెగాస్టార్‌.  శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు త‌నకు మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని గుర్తు చేసారు. త‌నతో స్నేహం ముఖ్యంగా ఖైదీ సినిమా నుంచి ప్రారంభం అయింద‌ని గుర్తు చేసారు చిరంజీవి.

ఆ త‌రువాత  కూడా చాలా సినిమాల‌కు మేము క‌లిసి ప‌నిచేసామ‌ని చెప్పుకొచ్చారు.  రామ్ చ‌ర‌ణ్ మ‌గ‌ధీర సినిమా లో ధీర ధీర పాట‌కు శివ శంకర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫర్ గా చేశాడని..  అందుకు శివ శంకర్ మాస్ట‌ర్ కు జాతీయ అవార్డు ద‌క్కింద‌ని వెల్ల‌డించారు మెగాస్టార్‌. అదేవిధంగా శివ శంక‌ర్ మాస్ట‌ర్ ను చివ‌రి సారి ఆచార్య సినిమా సెట్లో క‌లిసిన‌ట్టు  చెప్పారు. కానీ ఆ మీటింగ్  చివ‌రి సారి అవుతుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేద‌ని చిరంజీవి పేర్కొన్నారు.  ఇటీవ‌ల శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు క‌రోనా చికిత్స కోసం రూ. 3 ల‌క్ష ల‌ను చిరంజీవి అంద‌జేసిన విష‌యం విధిత‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: