దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస ఐదు రోజుల లాభాలను బ్రేక్ పడింది. వరసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల అనంతరం నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో సూచీలు పతనమయ్యాయి. ఉదయం నుంచి లాభాల పరంపర కొనసాగినప్పటికీ చివరి గంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. . ఉదయం లాభాలతో ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావంతో ఊగిసలాటలో కొనసాగినప్పటికీ మిడ్ సెషన్ తర్వాత పూర్తిగా బలహీనపడింది. దీంతో సెన్సెక్స్ 345.51 పాయింట్లను కోల్పోయి 36,329 వద్ద ముగియగా, నిఫ్టీ 93.90 పాయింట్ల నష్టంతో 10,705 వద్ద క్లోజయింది. 

 

ఐటీ, ఆటో, మౌలిక రంగాల్లో అమ్మకాలు జరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 346 పాయింట్లు నష్టపోయి వద్ద 36,329 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 10,705 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.07గా ఉంది. వరుస ఐదురోజుల ర్యాలీతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఈ కారణంగానే మార్కెట్లకు నష్టాలు తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 5శాతానికి పైగా లాభపడింది.  మార్కెట్‌ స్వల్పలాభాల ప్రారంభంలో భాగంగా ఈ ఇండెక్స్‌ 1,480.50 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒకదశలో 5.22శాతం లాభపడి 1555 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

 

మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ నిన్నటి ముగింపు(1,477.80)తో పోలిస్తే 5శాతం లాభంతో 1,551.85 వద్ద ట్రేడ్ అయింది. ముఖ్యంగా నిఫ్టీలో ఐటీ, ఆటో, మీడియా, రియల్టీ రంగాలు 2 శాతం వరకూ నష్టపోయాయి. ఫార్మా, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు స్వల్పంగా లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు అధికంగా 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను నమోదు చేయగా, మిగిలిన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: