నేడు అంత్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చాలా సంస్థలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ కూడా మహిళా వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. రుణగ్రహీతలకు గృహ రుణ రేట్లపై వడ్డీపై మరింత తగ్గింపును ప్రకటించింది. మహిళా దినోత్సవం రోజున, మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది, 6.70 శాతం నుంచి ప్రారంభం కానున్న వడ్డీ రేట్లపై ఇది వర్తిస్తుంది.


మార్చి 1 న ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లతో బ్యాంక్ ఇప్పుడు 70 బేసిస్ పాయింట్ల (బీపీఎస్‌) వరకు వడ్డీ రాయితీని అందిస్తుంది. ఇది మార్చి 31 తో ముగిసే పరిమిత కాల ఆఫర్. ప్రాసెసింగ్ ఫీజు కూడా బ్యాంకు 100 శాతం రద్దు చేసింది. రుణాల పై వడ్డీ తగ్గింపు అనేది సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉంటే వినియోగదారులకు మెరుగైన రేట్లు అందించడం చాలా ముఖ్యం అని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. ఎస్‌బీఐ వినియోగదారుల కోసం వివిధ గృహ రుణాలను అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపారు.


రూ. 75 లక్షల వరకు ఉన్న రుణాలకు 6.70 శాతం నుంచి నుంచి రూ. 75 లక్షలకు పైబడిన రుణాలకు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వడ్డీ పై అదనపు రాయితీ నీ పొందాలంటే బ్యాంక్ సంభందిత యాప్ ఎస్బిఐ యోనో యాప్ ద్వారా పొందవచ్చు. ఫిబ్రవరి 2021 లో, ఎస్‌బీఐ తన గృహ రుణ వ్యాపారంలో రూ. 5 ట్రిలియన్  మార్కును దాటి మరో మైలురాయిని చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 7 ట్రిలియన్ డాలర్ల గృహ రుణాలను అందించడంపై బ్యాంక్ దృష్టి సారించింది. కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్, తదితర బ్యాంకులు కూడా రుణాల పై తక్కువ వడ్డీని అందిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: